by సూర్య | Fri, Jun 21, 2019, 12:25 PM
ఖాదీ వాడకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లోని యూనిఫాంలు స్వదేశీ బట్టతో తయారు చేయాలని ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకుశుక్రవారం యుపి రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ: "ఖాదీని ప్రోత్సహించడానికి మరియు పిల్లలను దాని ప్రాముఖ్యతగా మార్చడానికి, ఖాదీ పాఠశాల యూనిఫాంలో ప్రాథమిక పాఠశాలలలో (1 నుండి 5 తరగతులు) పైలట్ ప్రాజక్టుగా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ముందుగా బహ్రాయిచ్తో సహా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును మొదట ఒక్కో బ్లాక్లో జూలై నుంచి ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఖాదీ నాణ్యమైన బట్ట అని, పాఠశాల యూనిఫామ్లకు అనువైనదని ఆమె అన్నారు. పైలెట్ ప్రాజక్టు ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరిస్తామని" అని జైస్వాల్ చెప్పారు.
Latest News