by సూర్య | Fri, Jun 21, 2019, 12:19 PM
తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన పరిణామాలపై యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు ఇక్కడి టిడిపి నేతలతో ఫోన్లో మాట్లాడారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం తమకు కొత్త కాదని ఆయన అన్నారు. తమ పార్టీ పునరుత్సాహంతో వస్తుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే తాము బిజెపితో పోరాడామని ఆయన చెప్పారు.
Latest News