by సూర్య | Fri, Jun 21, 2019, 11:44 AM
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. నియామక ఫైలుపై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. వైవీ సుబ్బారెడ్డి.. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. 2019లో కూడా అదే స్థానం నుంచి టికెట్ ఆశించారు. కానీ టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వడం కోసం జగన్.. సుబ్బారెడ్డిని పక్కనబెట్టారు. దీంతో ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని పనులు వైవీనే చూసుకున్నారు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఆయనను టీటీడీ చైర్మన్గా నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్న టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ రెండ్రోజుల క్రితమే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను టీటీడీ ఈవో ఆమోదించారు. దీంతో వైవీ సుబ్బారెడ్డికి లైన్క్లియరైంది. వైవీ సుబ్బారెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేస్తారు.
Latest News