by సూర్య | Fri, Jun 21, 2019, 11:34 AM
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కళిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఫర్నీచర్ మార్కెట్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న 17 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. అయితే అగ్నిప్రమాదం కారణంగా.. కళిందికుంజ్ - జశోలా విహార్ షాహీన్ బాగ్ మధ్య మెట్రో సర్వీసులను నిలిపివేశారు. ఈ మెట్రో మార్గం కిందనే అగ్నిప్రమాదం జరిగింది. ఇక దట్టమైన పొగ కూడా కమ్ముకోవడంతో మెట్రో సర్వీసులను నడపడం కష్టంగా మారిందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఫర్నీచర్ మార్కెట్లో సంభవించిన అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Latest News