by సూర్య | Fri, Jun 21, 2019, 11:26 AM
ప్రభుత్వ పథకాల అమలును మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడం, అవినీతికి తావులేకుండా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పార్టీని పటిష్టం చేయడంతో పాటు అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఇన్ చార్జి మంత్రులను నియమించారు. వీరిలో ఉపముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. సీఎం జగన్ ఏ జిల్లాకు ఎవరిని ఇన్ చార్జీగా నియమించారంటే..
శ్రీకాకుళం జిల్లా - వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా- చేరుకువాడ శ్రీరంగనాధరాజు
విశాఖపట్నం జిల్లా- మోపిదేవి వెంకటరమణ
ప్రకాశం జిల్లా - అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు జిల్లా - మేకతోటి సుచరిత
కర్నూలు జిల్లా - బొత్స సత్యనారాయణ
తూర్పు గోదావరి జిల్లా - ఆళ్ల నాని
పశ్చిమ గోదావరి జిల్లా - పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా జిల్లా - కురసాల కన్నబాబు
గుంటూరు జిల్లా - పేర్ని నాని
కడప జిల్లా - బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అనంతపురం జిల్లా - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా - మేకపాటి గౌతమ్ రెడ్డి