by సూర్య | Thu, Jun 20, 2019, 10:00 PM
తిరుపతిలోని అవిలాల చెరువులో చేపడుతున్న అభివృద్ధి పనులను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం గురువారం సాయంత్రం తనిఖీ చేశారు.వేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవనం(స్పిరిచువల్ థీమ్ పార్క్) పనులను జెఈవో పరిశీలించారు. మొదటి దశలో ఇంటర్నల్ ఫెన్సింగ్ వెలుపల ప్రహరీ, హైవే నుండి రోడ్డు, టికెట్ కౌంటర్లు, ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులు నిలిపి ఉంచేందుకు వీలుగా పార్కింగ్ ప్రదేశం, సర్వీస్ రోడ్, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు పనులు చేపట్టాలని జెఈవో అధికారులను ఆదేశించారు. సందర్శకుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, ఫుడ్కోర్టులు ఏర్పాటుచేయాలన్నారు.
Latest News