by సూర్య | Thu, Jun 20, 2019, 09:57 PM
నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విషయమై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సోనియా, రాహుల్ లకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసినలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీలకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి 2011-12 సంవత్సరంలో సోనియా, రాహుల్ ఆదాయపన్ను వివరాలను పునఃపరిశీలన చేస్తే తప్పేంటని నిలదీస్తూ, సుప్రీంకోర్టు ఐటీశాఖ అధికారులకు అనుమతిని ఇచ్చింది. గతంలో ఇదే విష|యమై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పను.. సోనియా, రాహుల్ లు సుప్రీంలో సవాల్ చేయగా గురువారం ఈ కేసుపై విచారించిన ధర్మాసనం ప్రస్తుత దశలో కేసులో జోక్యం చేసుకోలేమని, జనవరి 8వ తేదీన ఈ కేసు తుది విచారణ చేపడతామని సుప్రీం స్పష్టం చేసింది.
Latest News