పూజ కోసం వెళ్లి అగ్నిప్రమాదానికి గురయిన మ‌హిళ‌!

by సూర్య | Thu, Jun 20, 2019, 08:03 PM

కర్నాటకలో ఒక మహిళ అగ్నిప్రమాదానికి గురయ్యారు. ఆలయం ఆవరణలో విగ్రహానికి పూజ చేసి వస్తున్న సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీపానికి ఆమె చీర తాకడంతో అగ్నిఅంటుకుంది. తొలుత ఆ విషయాన్ని గమనించని ఆమె తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. శరీరం మొత్తం మంటలు తాకాయి. గట్టిగా కేకలు వేయడంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వచ్చి మంటలార్పేందుకు ప్రయత్నించారు. కానీ అరుస్తూ సదరు మహిళ పక్కనే ఉన్న ఒక గదిలోకి వెళ్లిపోయింది. దీంతో కలకలం రేగింది. ఆలయానికి వచ్చిన భక్తులంతా కలిసి అతి కష్టం మీద మంటలు ఆర్పారు. అప్పటికే ఆమెకు బాగా గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కర్నాటకలోని హుబ్లీ విశ్వనాథ ఆలయంలో ఈ ఘటన జరిగింది. మహిళ పూజ చేయడం, ఆ తర్వాత వెనుదిరగడం అంతలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆమె గదిలోకి పరుగులు తీయడం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM