అవినీతి, అక్రమాలు కప్పిపుచ్చుకోడానికే పార్టీ మార్పు! రామచంద్రయ్య

by సూర్య | Thu, Jun 20, 2019, 07:33 PM

టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సూచన మేరకే వీరంతా పార్టీ మారుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకే చంద్రబాబుకుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.  వీటన్నిటినీ కప్పిపుచ్చుకోడానికే  తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరేలా  ప్లాన్ చేసారని రామచంద్రయ్య ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వారిని పార్టీలో చేర్చుకునే ముందు ప్రధాని మోదీ ఒక్కసారి ఆలోచించాలని విఙ్ఞప్తి చేశారు. చంద్రబాబు లాంటి వారిని ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM