by సూర్య | Thu, Jun 20, 2019, 04:47 PM
ఎన్నికల్లో దారుణ ఓటమి నేపథ్యంలో, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించారు.ఈ క్రమంలోనే గతంలో టిడిపి ఏపి అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకటరావును పక్కకు పెట్టి టీడీపీకి విశేష సేవలందింస్తూ కష్టకాలంలో నమ్ముకుని వెన్నంటి ఉన్న కింజారపు కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేలా. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిని నియమించినట్టు పార్టీ వర్గాల భోగట్టా ఇప్పటికే రామ్మోహన్ నాయుడిని లోక్ సభాపక్ష ఉప నాయకుడిగా ఉండగా తాజాగా ఏపీ రాష్ట్ర శాఖ బాధ్యతలు అందుకోవటం ద్వారా యువతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సూచనలుగా చెపుతున్నారు. పార్టీ శ్రేణులలోనూ సీనియర్లను సలహా కమిటీలకు పరిమితం చేసి కీలక పోస్టులన్నీ యువతకే అందించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Latest News