దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: సంజీవ్‌ కుమార్‌

by సూర్య | Thu, Mar 21, 2019, 01:46 PM

బెంగళూరు: దివ్యాంగ ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కర్ణాటక పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 18న రెండవ, ఏప్రిల్‌ 23న మూడవ దశలో పోలింగ్‌ నిర్వహణ జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని ఓటర్లలో 4,03,907 మంది దివ్యాంగుల అవసరాలను గుర్తించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. వీరి సౌకర్యం నిమిత్తం 35 వేల వీల్‌ చైర్లు, 52 వేల మ్యాగ్నిఫైడ్‌ కళ్లద్దాలు, 2213 మంది మూగ సైగల అనువాదకులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు పీడబ్ల్యూడీ ఓటర్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసే పోలింగ్‌ బూత్‌ల్లోనే వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM