by సూర్య | Thu, Mar 21, 2019, 01:51 PM
లక్నో : 17వ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని సీనియర్ బీజేపీ నాయకుడు, దేవరియో ఎంపీ కల్రాజ్ మిశ్రా ప్రకటించారు. ఈ సందర్భంగా కల్రాజ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు పూర్తి స్థాయి సమయం కేటాయిస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ప్రియాంక గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూరదని, మరోసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తారని కల్రాజ్ మిశ్రా స్పష్టం చేశారు.
Latest News