by సూర్య | Thu, Mar 21, 2019, 10:35 AM
గుజరాత్లోని అహ్మదాబాద్లో యువత హోళీ పండుగను వినూత్నంగా జరుపుకొన్నారు. హోళీ రోజున రకరకాల రంగులు జల్లుకుంటూ వేడుకలు నిర్వహించుకోవడం సాధారణం. అయితే దీనికి భిన్నంగా వారు టమాటాలతో హోళీ వేడుకలు నిర్వహించుకున్నారు. రసాయనాలతో చేసిన రంగుల కంటే, ప్రకృతి సహజమైన రంగులుండే టమాటాలను రంగులు చల్లుకోవడానికి ఎంచుకున్నారు. రోడ్డంతా కిలోల కొద్దీ టమాటాలను పోసి వాటి రసాన్ని ఒకరిపై ఒకరు చిమ్ముకున్నారు.
Latest News