గుండెపోటుతో అన్నాడీఎంకే ఎమ్మెల్యే మృతి

by సూర్య | Thu, Mar 21, 2019, 10:34 AM

అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్‌ గుండెపోటుతో మృతిచెందారు. సులూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు. ఎమ్మెల్యే కనగరాజ్‌ ఈ రోజు ఉదయం న్యూస్‌ పేపర్‌ చదువుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా 2016 మే నుంచి ఇప్పటివరకూ అయిదుగురు ఎమ్మెల్యేలు చనిపోయారు. శ్రీనివేల్‌, ఏకే బోస్‌ (తిరుప్పరంగుండ్రం), జయలలిత (ఆర్కే నగర్‌) కరుణానిధి (తిరువారూర్‌), కనగరాజ్‌ (సులూరు) అనారోగ్యంతో కన్నుమూశారు.

Latest News

 
బాబు తోనే అభివృద్ధి, సంక్షేమం.. గొండు శంకర్ Tue, Apr 30, 2024, 12:51 PM
వాల్మీకి విగ్రహానికి వైసీపీ నేతలు నివాళి Tue, Apr 30, 2024, 12:39 PM
గజ వాహనంపై ముక్తిరామలింగేశ్వరుడు Tue, Apr 30, 2024, 10:50 AM
వైసిపి మద్దతుదారునపై కత్తులతో దాడి Tue, Apr 30, 2024, 10:28 AM
ఎన్డిఏ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి Tue, Apr 30, 2024, 10:18 AM