by సూర్య | Wed, Mar 20, 2019, 10:13 PM
హిందూపురం నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ సీఐ గోరంట్ల మాధవ్ రాజీనామాను ఆమోదించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మాధవ్ పోలీసు కొలువుకు చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించని నేపథ్యంలో . నిబంధనల ప్రకారం నామినేషన్ వేయాలంటే పదవికి రాజీనామా చేశాక మూడు నెలల గడువు ఉండాల్సి ఉన్నందున ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. దీంతో ఆయన కోర్టుకెక్కారు. తక్షణం మాధవ్ రాజీనామా ఆమోదించాలని ఆదేశాలివ్వటంతో పాటు ఆయన ఎన్నికల్లో నామినేసన్ వేసుకోవచ్చని కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో హిందూపురంలో వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Latest News