by సూర్య | Wed, Mar 20, 2019, 08:16 PM
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మెనేజర్ గజానన్ మాల్య బుధవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠను కలిశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(జియం)గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మర్యాద పూర్వకమంగా సిఎస్ ను కలిశారు.ఈసందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరగుతున్న వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రగతిని,కొత్తగా మంజూరైన రైల్వే ప్రాజెక్టులు తదితర వివరాలను ఆయన సిఎస్ కు వివరించారు.సిఎస్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.అలాగే రాష్ట్రానికి కొత్తగా మంజూరు చేసిన ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పనులు చేపట్టేదుంకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. ఇంకా ఇరువురు అధికారులు రైల్వేకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈసమావేశంలో విజయవాడ రైల్వే డివిజినల్ మేనేజర్ ఆర్.ధనంజయులు,ఆర్పిఎఫ్ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమీషనర్ సచిన్ బలోడే,జియం పిఎస్.నీలకంఠా రెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.
Latest News