by సూర్య | Wed, Mar 20, 2019, 08:23 PM
సీసీఎల్ఏ కమిషర్గా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద్ర పునేఠాను, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కొనియాడారు. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద్ర పునేఠాను మంగళవారం ఘనంగా సన్మానించారు. అనేక శాఖల్లో, పలు పదవుల్లో పనిచేసిన పునేఠా, వారి అనుభవాలను ఉద్యోగ సంఘాల నాయకులతో పంచుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు ఎంవీ. రమణ, సీసీఎల్ఏ అధనపు కార్యదర్శి కె. శారదాదేవి తదితరులు పాల్గొన్నారు.
Latest News