పెద్ద నోట్ల రద్దు వల్ల నష్టపోయిన వారికి పరిహారం!: ఎంకే స్టాలిన్‌

by సూర్య | Tue, Mar 19, 2019, 12:31 PM

చెన్నై: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు మంగళవారం మేనిఫెస్టో ఆవిష్కరించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా తేలి.. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయ‌డానికి కృషి చేస్తామని అందులో చేర్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేదు. తమిళనాడులో మొత్తం 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే 20 సీట్లలో పోటీ చేస్తుండగా మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM