by సూర్య | Tue, Mar 19, 2019, 12:31 PM
చెన్నై: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు మంగళవారం మేనిఫెస్టో ఆవిష్కరించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా తేలి.. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయడానికి కృషి చేస్తామని అందులో చేర్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేదు. తమిళనాడులో మొత్తం 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో డీఎంకే 20 సీట్లలో పోటీ చేస్తుండగా మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది.
Latest News