by సూర్య | Tue, Mar 19, 2019, 12:30 PM
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు మంగళవారం మేనిఫెస్టో ఆవిష్కరించారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవే..
రాష్ట్రంలోని కేంద్ర కార్యాలయాల్లో తమిళం తప్పనిసరి.
నీట్ రద్దు చేస్తాం.
శ్రీలంక శరణార్థులకు భారత పౌరసత్వం.
దక్షిణ భారత నదులు అనుసంధానానికి కృషి.
విద్యా రుణాలు మాఫీ చేస్తాం.
కొడనాడు ఎస్టేట్ దొపిడీపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తాం.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల నష్టపోయిన వారికి పరిహారం.
సేతు సముద్రం ప్రాజెక్టు తిరిగి పునరుద్దరణ.
గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలపై నియంత్రణ.
మనుషుల అక్రమ రవాణాపై కఠిన చట్టాలు రూపొందించడం.
పుదుచ్చేరికి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించేందుకు కృషి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు.
Latest News