by సూర్య | Thu, Oct 24, 2024, 12:46 PM
కుండపోత వర్షాలతో రైతుల సాగు చేసుకున్న వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం చెప్పారు.
నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సత్వర న్యాయం చేకూరుస్తామన్నారు.