by సూర్య | Wed, Oct 23, 2024, 08:19 PM
విజయవాడ పార్లమెంటు పరిధిలోని తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట నియోజక వర్గాలతోపాటు నూజివీడు నియోజకవర్గ ప్రజల సాగునీటి సమస్యల పరిష్కారానికి వేదాద్రి, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఎంపీ కేశినేని చిన్ని అభిప్రాయపడ్డారు. చింతలపూడి ప్రాజెక్టు పనులను 2025 మార్చి నాటికి ప్రారంభిస్తాం. దీనిపై సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వేదాద్రి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి అని తెలిపారు.
Latest News