తిరుమలలో హెలికాఫ్టర్‌ కలకలం

by సూర్య | Wed, Oct 23, 2024, 08:11 PM

తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో సోమవారం ఓ హెలికాఫ్టర్‌ ప్రయాణించడం కలకలం సృష్టించింది. సాధారణంగా ఆలయ ఆగమశాస్త్రం ప్రకారం గర్భాలయం పైభాగంలో విమానాల రాకపోకలుండకూడదు. అయితే కొద్ది నెలలుగా తిరుమల క్షేత్రం మీదుగా విమానాలు, హెలికాఫ్టర్లు ప్రయాణిస్తూనే ఉన్నాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు అర్చకులు, ఆగమ పండితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తిరుమలను నోఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ గతంలో అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే నోఫ్లయింగ్‌ జోన్‌గా తిరుమలను ప్రకటించడం సాఽధ్యం కాదని కేంద్రమూ స్పష్టం చేసింది.


కానీ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వీలైనంతవరకు తిరుమల క్షేత్రం మీదుగా విమానాలు, హెలికాఫ్టర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే ఇటీవల తిరుమలపై విమానాలు ప్రయాణిస్తూనే ఉన్నాయి. తాజాగా సోమవారం ఉదయం 10.30 గంటల సమమంలో హెలికాఫ్టర్‌ భారీ శబ్దంతో ప్రయాణించడంతో మళ్లీ నో ఫ్లయింగ్‌ జోన్‌ అంశం తెరపైకి వచ్చింది. ఈ హెలికాఫ్టర్‌పై ఉన్న లోగోను పరిశీలిస్తే ఇండియన్‌ ఆర్మీకి సంబంధించినదిగా తెలుస్తోంది. దీంతో టీటీడీ అధికారులు మౌనంగా ఉండిపోయారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM