by సూర్య | Wed, Oct 23, 2024, 08:07 PM
భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. నందికొట్కూరు , అల్లూరులో మంగళవారం తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రీ సర్వేలో వచ్చిన భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు. ముఖ్య అథిగా ఎమ్మెల్యే హాజరై రైతుల నుంచి వినతులను స్వీకరించారు. ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వోలు స్వామన్న, వెంకటేశ్వర్లు, నరసరాజు, ఆనంద్, మద్దిలేటి, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్ర నాథరెడ్డి, గ్రామ సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య, వడ్డెమాను సర్పంచ్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
Latest News