by సూర్య | Wed, Jul 10, 2024, 03:02 PM
ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన పవన్ కుమార్ మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. పవన్ కుమార్ మద్యానికి బానిసై అప్పులు ఎక్కువగా చేయడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News