by సూర్య | Wed, Jul 10, 2024, 02:59 PM
ధర్మవరం పట్టణం నుంచి చెన్నైకు నూతన బస్సు సర్వీసు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతులు మీదుగా ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ధర్మవరం నుంచి కొత్తచెరువు, పుట్టపర్తి, కదిరి, మదనపల్లి, తిరుపతి మీదుగా బస్సు సర్వీసును నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ధర్మవరంలో రాత్రి 8గంటలకు బయలుదేరి మరసటి రోజు ఉదయం 6గంటలకు చెన్నై కు చేరుకుంటున్నట్లు తెలిపారు.
Latest News