భర్తని హతమార్చిన భార్య

by సూర్య | Sat, Apr 27, 2024, 05:06 PM

సమాజంలో రోజురోజుకి బంధాలు, అనుబంధాలు తెగిపోతున్నాయి. కుటుంబ సభ్యులే ఒకరినొకరు హత్య చేసుకుంటూ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ప్రియుడి కోసం ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం మండలం సాలాపుగావాని పాలెంలో గల్లారవి(33) అతని భార్యతో కలిసి నివసిస్తున్నాడు. భార్య గరికపాటి శ్రీహరి అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. హత్య చేయడానికి ప్రియుడు ప్రణాళిక రచించాడు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కల్లాలలో పడుకున్న రవిని.. శ్రీహరి హత్య చేశాడు. ఉదయాన్నే విగతజీవిగా పడిఉన్న అతన్ని చూసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రవిని హత్య చేసినట్లు గుర్తించారు. అతని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
నేడు కర్నూలులో పర్యటించనున్న సీఎం జగన్ Thu, May 09, 2024, 10:28 AM
నేను రాయలసీమ బిడ్డనే Thu, May 09, 2024, 10:27 AM
పేద ప్రజలను వైసీపీ దోపిడీచేసింది Thu, May 09, 2024, 10:27 AM
దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి Thu, May 09, 2024, 10:26 AM
ఆంధ్రప్రదేశ్‌ వికాసం.. మోదీ లక్ష్యం Thu, May 09, 2024, 10:25 AM