ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోవాలి

by సూర్య | Sat, Apr 27, 2024, 05:05 PM

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. ఈ రన్ లో పాల్గోన్న ముకేష్ మాట్లాడుతూ.. "దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవడం యువత బాధ్యత. 18 ఏళ్ల నిండినవారు ఓటు హక్కును నమోదు చేసుకోవటమే కాదు తప్పనిసరిగా ఓటు వేయాలి. ప్రజాస్వామ్య దేశంలో పోలింగ్ రోజే అసలైన పండగ. ఈ పండగలో యువత తప్పనిసరిగా పాల్గొనాలి. దేశంలో అనేక ప్రాంతాలలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఓటింగ్ శాతం చాలా మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటింగ్ శాతం 82 శాతానికిపైగా ఉండేలా కృషి చేస్తున్నాం" అని అన్నారు.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Thu, May 09, 2024, 11:43 PM
రేపు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు Thu, May 09, 2024, 10:15 PM
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందే : సీఎం జగన్ Thu, May 09, 2024, 09:45 PM
రూ.8.39 కోట్ల నగదు సీజ్ Thu, May 09, 2024, 06:20 PM
రోడ్ షో నిర్వహించిన టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు Thu, May 09, 2024, 06:16 PM