ఏసీని రాత్రంతా వాడినా నో కరెంట్ బిల్..

by సూర్య | Sat, Apr 13, 2024, 02:09 PM

ఏసీని రాత్రంతా వాడినా నో కరెంట్ బిల్.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో మనలో చాలామంది వేడి నుంచి ఉపశమనం పొందటానికి ఏసీలపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు.AC ఎక్కువగా వాడితే కరెంట్ బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. ఆ చిట్కాలు గురించి తెలుసుకుందాం.మనలో చాలామంది ఏసీని 16 లేదా 18° వద్ద పెడుతూ ఉంటారు. అలా అయితే కూలింగ్ బాగా వస్తుందని భావిస్తారు. అయితే మానవ శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు కాబట్టి ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచితే సరిపోతుంది. ఇలా ఉష్ణోగ్రతను పెంచటం ద్వారా ఆరు శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.ఏసీ ఆన్ చేయటానికి ముందు గదిలో ప్రతి తలుపు మరియు ప్రతి కిటికీ మూసివేయాలి. ఇలా చేయడం వలన వేడి గాలి లోపలికి రాదు. చల్లని గాలి బయటకు వెళ్ళదు. ఈ విధంగా చేయకపోతే ఏసీ ఎక్కువగా పనిచేసి కరెంట్ బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది. ఏసీ ని స్లీప్ మోడ్లో ఉపయోగిస్తే 36 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.


 


ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా ఉపయోగిస్తే ఏసీ గాలి గదిలో ప్రతి మూలకు వెళుతుంది. దాంతో గది ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. ఏసీ ఉష్ణోగ్రతను కూడా తగ్గించాల్సిన అవసరం రాదు. ఈ చిట్కాలను పాటిస్తే గది చల్లగా ఉండడమే కాకుండా తక్కువ కరెంటు బిల్లు కూడా వస్తుంది.


గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.


 


 

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM