చంద్రబాబు వస్తేనే అభివృధి జరుగుతుంది

by సూర్య | Fri, Apr 12, 2024, 06:21 PM

అనంతపురం జిల్లా, నల్లమాడ మండలంలోని మసకవంకపల్లి, మూలప్పగారిపల్లి, కురుమాల, గంగాపురం గ్రామాల్లో గురువారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరా రెడ్డి, ఆమె భర్తపల్లె వెంకటకృష్ణకిశోర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. తొలుత మూలప్పగారిపల్లినుంచి గంగాపురం వరకు రోడ్డుషో నిర్వహించారు. మసకవంకపల్లిలో వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ సంక్షేమపథకాలు సజావుగా అందేవన్నారు. వైసీపీ వచ్చాక కొందరికే పథకాలు అందుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిని గెలిపించాలని పజల్ని కోరారు. చంద్రబాబు సీఎం అయితే మళ్లీ పథకాలు అందరికీ అందిస్తారని పేర్కొన్నారు. తర్వాత మిగతా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మైలే శివశంకర్‌, నాయకులు బుట్టి నాగభూషణనాయుడు, వెంకటరమణనాయుడు, సుబ్బరాయుడు, రామచంద్ర, నారాయణస్వామి, నాగరాజు, సలీంబాషా, నిజాంవలీ, వేణుగోపాల్‌, గంగన్న కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
బిగ్ ఎక్స్‌పోజ్ బయటపెట్టిన టీడీపీ.. వైఎస్ షర్మిల రాశారంటూ లేఖ ట్వీట్ Wed, Oct 23, 2024, 11:20 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. రేపే ఆ కోటా టికెట్లు విడుదల Wed, Oct 23, 2024, 11:18 PM
విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా? Wed, Oct 23, 2024, 10:18 PM
షర్మిల, విజయమ్మకు షాకిచ్చిన వైఎస్ జగన్..ఎన్సీఎల్టీలో పిటిషన్, ఆ కంపెనీ షేర్ల కోసం! Wed, Oct 23, 2024, 10:16 PM
జగన్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు.. ఆ ఒక్క కారణంతో వైసీపీకి రాజీనామా చేశా: వాసిరెడ్డి పద్మ Wed, Oct 23, 2024, 10:13 PM