by సూర్య | Fri, Apr 12, 2024, 06:21 PM
అనంతపురం జిల్లా, నల్లమాడ మండలంలోని మసకవంకపల్లి, మూలప్పగారిపల్లి, కురుమాల, గంగాపురం గ్రామాల్లో గురువారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరా రెడ్డి, ఆమె భర్తపల్లె వెంకటకృష్ణకిశోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. తొలుత మూలప్పగారిపల్లినుంచి గంగాపురం వరకు రోడ్డుషో నిర్వహించారు. మసకవంకపల్లిలో వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ సంక్షేమపథకాలు సజావుగా అందేవన్నారు. వైసీపీ వచ్చాక కొందరికే పథకాలు అందుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిని గెలిపించాలని పజల్ని కోరారు. చంద్రబాబు సీఎం అయితే మళ్లీ పథకాలు అందరికీ అందిస్తారని పేర్కొన్నారు. తర్వాత మిగతా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మైలే శివశంకర్, నాయకులు బుట్టి నాగభూషణనాయుడు, వెంకటరమణనాయుడు, సుబ్బరాయుడు, రామచంద్ర, నారాయణస్వామి, నాగరాజు, సలీంబాషా, నిజాంవలీ, వేణుగోపాల్, గంగన్న కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News