by సూర్య | Fri, Apr 12, 2024, 06:20 PM
సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర, ఒడిశా పోలీసులు చేపట్టిన దాడుల్లో భారీస్థాయిలో పులిసిన ఊట బెల్లం, సారా డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. గురువారం పెళ్లిగుడ్డి, బొత్తడపల్లి సమీపంలో చేసిన దాడుల్లో 70 డ్రమ్ములు, 300 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నీలకంఠం తెలిపారు. 9 వేల లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో పార్వతీపురం రూరల్ ఎస్ఐ దినకర్, ఎక్సైజ్ అధికారులు, ఒడిశా పోలీసులు పాల్గొన్నారు.
Latest News