by సూర్య | Fri, Apr 12, 2024, 05:14 PM
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో శుక్రవారం కేంద్ర బలగాలతో అర్బన్ సీఐ సోమయ్య కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పోలింగ్ జరుగుతున్న సమయంలో స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సిఐ సోమయ్య ప్రజలను హెచ్చరించారు.
Latest News