by సూర్య | Mon, Mar 20, 2023, 11:04 AM
రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో చేపట్టిన ధర్నాకు పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. నంద్యాల నందికొట్కూరు నుండి విజయవాడలో జరిగే ధర్నాకు బయలుదేరి వస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను సత్తెనపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. ధర్నాకు వెళ్తున్న కార్యకర్తలను నందిగామ అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్న సత్తెనపల్లి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరు పట్ల అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Latest News