పట్టభద్రుల ఫలితాలు ప్రజల తిరుగుబాటుకు స్పష్టమైన సంకేతం

by సూర్య | Mon, Mar 20, 2023, 11:06 AM

రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో జరిగిన 3 పట్టభద్రుల నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన ఈ సందర్భాన్ని మూడ్ ఆఫ్ ఏపీ గా ప్రత్తిపాటి ఆదివారం అభివర్ణించారు. గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ప్రజలు ఎంతగా విసిగిపోయారో? ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలియజేశారు. డిగ్రీ పట్టాలను భద్రంగా దాచుకోవడమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూడా భద్రంగా కాపాడుకుంటామని ఓటర్లు ఈ ఎన్నికతో నిరూపించారని ప్రత్తిపాటి తెలిపారు. దొంగ ఓట్లతో, అధికార దుర్వి నియోగంతో అధికార పార్టీ వారు చేసిన అరాచకాలను ప్రజలు ఓటుతో ఎదుర్కొన్న విధానం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో, అవే ఫలితాలు రానున్న సాధారణ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ఈ సందర్భంగా ప్రత్తిపాటి తెలిపారు. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేసిన ప్రతి ఒక్క పట్టుభద్రుల ఓటర్లకు ఈ సందర్భంగా ప్రత్తిపాటి తన కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest News

 
వైసీపీ పార్టీ త‌ర‌ఫున స‌హానా ఫ్యామిలీని ఆదుకుంటామ‌న్న మాజీ సీఎం Wed, Oct 23, 2024, 02:52 PM
గుంటూరు, బ‌ద్వేల్ ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ రోజా ఆగ్ర‌హం Wed, Oct 23, 2024, 02:47 PM
తల్లి, సోదరి సహా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణను ప్రతివాదులుగా చేర్చిన వైసీపీ అధినేత Wed, Oct 23, 2024, 02:40 PM
హోం మంత్రిపై రోజా కామెంట్స్‌ Wed, Oct 23, 2024, 02:21 PM
నారాయణ కాలేజీ భవనం పైనుంచి జారిపడి ఇంటర్‌ విద్యార్థి మృతి Wed, Oct 23, 2024, 02:15 PM