by సూర్య | Mon, Mar 20, 2023, 09:52 AM
ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలోని రుద్రవరం రహదారిలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ను తొలగించాలంటూ నివాసితులు ఆదివారం ఆందోళన చేపట్టారు. సెల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్తో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని నివాసితులు కోరారు. చిన్నారులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పారు. మరలా పునరుద్ధరించేందుకు అనుమతి ఇవ్వకూడదన్నారు.
Latest News