ఓటిటి మూవీస్, వెబ్ సిరీస్‌ పై కీలక వ్యాఖలు చేసిన మంత్రి అనురాగ్

by సూర్య | Sun, Mar 19, 2023, 10:11 PM

ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు వచ్చిన తర్వాత సినిమా దర్శకుల దృష్టి పూర్తిగా మారిపోయింది. దర్శకులు అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లను అందిస్తున్నారు. అయితే కొన్ని వెబ్ సిరీస్‌లు అశ్లీలత, అసభ్యత, హింస వంటి అంశాల్లో హద్దులు దాటుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ కంటెంట్‌పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖలు చేసారు. సృజనాత్మకత పేరుతో అశ్లీలత, బరితెగింపుకు పాల్పడుతున్నారు. అలాంటి విషయాలను చూస్తూ ఊరుకోం. ఓటీటీలో అశ్లీలత పెరిగిపోవడంపై పలు ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. అవసరమైతే ఓటీటీకి సంబంధించి మార్గదర్శకాలు, సెన్సార్‌లు జారీ చేసేందుకు కేంద్రం వెనుకాడబోదని కేంద్ర మంత్రి తెలిపారు.


 


 

Latest News

 
టీడీపీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు.... చంద్రబాబు Fri, Jun 02, 2023, 08:59 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ Fri, Jun 02, 2023, 08:40 PM
యువకుడి దారుణ హత్య ,,,చంపేపి ఇంటి ముందు మృతదేహాం పడేసి వెళ్లిన దుండగులు Fri, Jun 02, 2023, 08:07 PM
అనినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తా,,,బుద్దా వెంకన్న Fri, Jun 02, 2023, 08:06 PM
భార్య చైన్‌ను మింగేసిన భర్త,,,ఆపరేషన్ చేయకుండా బయటకు తీసిన డాక్టర్లు Fri, Jun 02, 2023, 08:05 PM