ఈ నెల 21, 22 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:20 PM

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతి శ్రీవారి ఆలయంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ క్రమంలో ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని తెలిపారు. ఈ నెల 22న తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవి అలంకారం చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీవారు విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. బంగారు వాకిలిలో ఆగమ పండితులు, పురోహితులు ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM