![]() |
![]() |
by సూర్య | Sun, Mar 19, 2023, 03:18 PM
పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఎందుకు ఈ తోడేళ్లు ఏకం అవుతున్నాయి? అని టీడీపీ, జనసేనను ఉద్దేశించి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది మంచి మాత్రమేనని, సినిమాల్లో హీరోలు మాత్రమే నచ్చుతారు.. విలన్లు కాదని జగన్ తెలిపారు. విలన్ ఎవరికీ నచ్చడని, దత్తపుత్రుడు, దుష్టచతుష్టయంతో యుద్దం చేస్తున్నానని చెప్పారు.
'దుష్ట చతుష్టయానికి సవాల్ విసురుతున్నా. నా ప్రభుత్వ పరిపాలన సరిగా లేకపోతే పొత్తుల కోసం మీరెందుకు పాకులాడుతున్నారు. కుటుంబ విలువలు, రాజకీయ విలువలు లేనివారితో నేను యుద్దం చేస్తున్నా. ఎన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది మంచి మాత్రమే. రామాయణమైనా, బైబిల్ అయినా, ఖురాన్లోనైనా మంచి చేసినవారే గెలుస్తారు. అర్హత లేనివాళ్లు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు' అని జగన్ తెలిపారు. గతంలో పోలిస్తే ఇప్పుడు అప్పుల పెరుగుదల తక్కువేనని జగన్ వ్యాఖ్యానించారు. గతంలో దోచుకో.. పంచుకో.. తినుకో అనేలా డీపీటీ నడిపారని, మనది డీబీటీ అయితే వాళ్లది డీపీటీ అని జగన్ విమర్శించారు