అనుమానాస్పదంగా మేడ పైనుంచి క్రిందకి విద్యార్థిని

by సూర్య | Sun, Mar 19, 2023, 01:25 PM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఉన్న వైవీఎస్‌ అండ్‌ బీఆర్‌ఎస్‌ఎం నర్సింగ్‌ కళాశాల విద్యార్థిని పల్లవిని శనివారం ఉదయం తోటి విద్యార్థినులు మేడ పైనుంచి గెట్టివేయడంతో ఆమె కాలు, చెయ్యి మూడు చోట్ల విరిగాయి. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కళాశాల హాస్టల్‌ రూమ్‌లో 8 మంది విద్యార్థినులు ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఒకరి డబ్బులు పోవడంతో అందరి బ్యాగ్‌లను విద్యార్థినులు వెతికారు. కాగా శనివారం ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి తనను గెంటేశారని పల్లవి చెబుతోంది. పల్లవి తొలుత కళ్లు తిరిగి పడిపోయినట్టు చెప్పినట్టు సమాచారం. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కె.శంకరరావును ఎస్‌ఐ అందే పరదేశి కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Latest News

 
ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీకే శివకుమార్ Wed, Mar 29, 2023, 09:04 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Wed, Mar 29, 2023, 08:51 PM
వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:48 PM
రాష్ట్రం నీ అబ్బ సొత్తా... జగన్ పై మండిపడ్డిన వైసీపీ రెబల్ ఎంపీ Wed, Mar 29, 2023, 08:40 PM
ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్: కొడాలి నాని Wed, Mar 29, 2023, 08:38 PM