by సూర్య | Sun, Mar 19, 2023, 01:21 PM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లు అన్నీ నిండి క్యూలైన్ బయటకు వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 75,452 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 39,262 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Latest News