by సూర్య | Sun, Mar 19, 2023, 01:21 PM
కాకినాడ జిల్లాలోని తుని దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు తుని హైవేపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. బాధితులను క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తుండగా చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News