మరికాసేపట్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద నగదు విడుదల

by సూర్య | Sun, Mar 19, 2023, 12:49 PM

సీఎం జగన్, జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల సందర్భంగా  ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చేరుకున్నారు. తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్‌ కళాశాలకు చేరుకున్న‌ సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, వైయస్‌ఆర్‌ సీపీ ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. తిరువూరు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి సీఎం బయల్దేరారు. మరికాసేపట్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్‌–డిసెంబర్‌ 2022 త్రైమాసికానికి సంబంధించిన నగదును సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. 

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM