by సూర్య | Sun, Mar 19, 2023, 12:14 PM
ఏపీలో భారీ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ మొదలుపెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
Latest News