by సూర్య | Sun, Mar 19, 2023, 11:42 AM
బిసి సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో 34, 594 కోట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు కేటాయించి నూతన రాజకీయ శకానికి ముఖ్యమంత్రి నాంది పలికినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కులమత రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
Latest News