బీసీ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత

by సూర్య | Sun, Mar 19, 2023, 11:42 AM

బిసి సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో 34, 594 కోట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు కేటాయించి నూతన రాజకీయ శకానికి ముఖ్యమంత్రి నాంది పలికినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కులమత రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.

Latest News

 
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM