by సూర్య | Sun, Mar 19, 2023, 11:38 AM
నకరికల్లు పరిధిలోని అద్దంకి- నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిలో శనివారం సాయంత్రం ఈదురు గాలుల ధాటికి భారీ లారీ బోల్తా పడింది. చెన్నై నుండి హైదరాబాద్ కు ఫ్రిజ్ ల లోడుతో వెళ్తున్న లారీ శ్రీరాం పురం వద్ద ఒక్కసారిగా బోల్తా పడటంతో, లారీలో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పడిపోయిన లారీని ప్రొక్లెయిన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్రమబద్దకరించారు.
Latest News