వేగవంతంగా జగనన్న కాలనీ గృహ నిర్మాణాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:25 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా చేపడుతున్న జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని పోలాకి మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ గురునాధరావు తెలిపారు. శనివారం హౌసింగ్ డే సందర్భంగా పోలాకి పంచాయతీలోని నరసాపురం లేఅవుట్ లో గృహాలు నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గృహాలబ్ధిదారు సనపల లక్ష్మీ గోవిందరావు గృహ ప్రవేశ కార్యక్రమం చేపట్టడంతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక లే అవుట్ లో 60 గృహాలను మంజూరు చేయడం జరిగిందని ఇప్పటికీ 32 ఇల్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని వివరించారు. మిగిలిన గృహాలు కూడా పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరమని తెలిపారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM