వామపక్ష నాయకులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:27 AM

జీవో నెంబర్ ఒకటి రద్దు పోరాట ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా అమరావతి, తాడేపల్లిలోని చలో అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే ఉద్దేశంతో వామపక్ష పార్టీ నాయకులను జిల్లా వ్యాప్తంగా ముందస్తుగానే 151నోటీసులిచ్చి పోలీసులు అరెస్టు చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావును శనివారం ఆయన స్వగృహంలో పోలీసులు నోటీసులిచ్చి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ గృహనిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయలేరని, జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలను చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని హెచ్చరించారు, సిపిఐ పార్టీ నాయకులు అనపాన షణ్ముఖరావు మాట్లాడుతూ ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అమలుపరిచి ప్రజలను ఏ మార్చాలని చూస్తే సహించేది లేదని, గృహనిర్బంధాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వ అణచవేత తీర్పు నిదర్శనమని అన్నారు.

Latest News

 
వివేకా హత్య కేసులో కీలక పరిణామం సునీత పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన సీబీఐ కోర్టు Thu, Dec 11, 2025, 05:32 AM
సాధ్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్ష Thu, Dec 11, 2025, 05:19 AM
కెనడా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడితో కీలక సమావేశం Thu, Dec 11, 2025, 05:17 AM
తిరుమల వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకుంటే ఇబ్బందులే Wed, Dec 10, 2025, 09:50 PM
ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష Wed, Dec 10, 2025, 09:03 PM