by సూర్య | Sun, Mar 19, 2023, 10:04 AM
నేడు విశాఖపట్నంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. మధ్యాహ్నం వరకు వర్షం తగ్గితే మ్యాచ్ ను నిర్వహిస్తారు. దీంతో వర్షం తగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Latest News