by సూర్య | Sun, Mar 19, 2023, 09:46 AM
జమ్మూ కశ్మీర్లోని అవంతిపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో బిహార్కు చెందిన నలుగురు వలస కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి ప్రయాణికులంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శ్రీనగర్-జమ్మూ నేషనల్ హైవేపై పుల్వామా జిల్లాలోని అవంతిపుర ప్రాంతంలో జరిగింది.
Latest News