రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి, మోసపూరితం: సిఐటియు

by సూర్య | Sat, Mar 18, 2023, 07:46 PM

రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టిన 2, 79, 000 కోట్ల రూపాయలు అంకెల గారడీ, మోసపూరిత బోగస్ బడ్జెట్  అని అన్నమయ్య జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ అన్నారు. రైల్వే కోడూరు  సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ అంచనాలకు ఆచరణకు పొంతన లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్ అంకెల మోసమే అన్నారు. వసూళ్లు, కేటాయింపులు, ఖర్చులకు పొంతన లేదన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి లేదు, కొత్త పరిశ్రమలు రాలేదు, ఉపాధి లేదు అన్నారు. కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి అమలు చేయలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, కోశాధికారి కరతోటి హరి నారాయణ పాల్గొన్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM