అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

by సూర్య | Sat, Mar 18, 2023, 07:27 PM

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామంలో వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తోడుగా గాలి, వడగళ్ళు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. విపరీతమైన గాలులకు అరటి తోటలు కుప్పకూలిపోయాయని, వడగళ్ళు పడడంతో కర్బూజా, దోసకాయలు పగిలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే అంచనాలు తయారు చేసి ఉన్నత అధికారులకు పంపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చంగయ్య, హరి, జయరామయ్య, పెంచలయ్య, రమణ పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM