అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

by సూర్య | Sat, Mar 18, 2023, 07:27 PM

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామంలో వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తోడుగా గాలి, వడగళ్ళు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. విపరీతమైన గాలులకు అరటి తోటలు కుప్పకూలిపోయాయని, వడగళ్ళు పడడంతో కర్బూజా, దోసకాయలు పగిలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే అంచనాలు తయారు చేసి ఉన్నత అధికారులకు పంపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చంగయ్య, హరి, జయరామయ్య, పెంచలయ్య, రమణ పాల్గొన్నారు.

Latest News

 
ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీకే శివకుమార్ Wed, Mar 29, 2023, 09:04 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Wed, Mar 29, 2023, 08:51 PM
వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:48 PM
రాష్ట్రం నీ అబ్బ సొత్తా... జగన్ పై మండిపడ్డిన వైసీపీ రెబల్ ఎంపీ Wed, Mar 29, 2023, 08:40 PM
ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్: కొడాలి నాని Wed, Mar 29, 2023, 08:38 PM