అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

by సూర్య | Sat, Mar 18, 2023, 07:27 PM

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామంలో వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తోడుగా గాలి, వడగళ్ళు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. విపరీతమైన గాలులకు అరటి తోటలు కుప్పకూలిపోయాయని, వడగళ్ళు పడడంతో కర్బూజా, దోసకాయలు పగిలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే అంచనాలు తయారు చేసి ఉన్నత అధికారులకు పంపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చంగయ్య, హరి, జయరామయ్య, పెంచలయ్య, రమణ పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM