అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

by సూర్య | Sat, Mar 18, 2023, 07:27 PM

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామంలో వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తోడుగా గాలి, వడగళ్ళు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. విపరీతమైన గాలులకు అరటి తోటలు కుప్పకూలిపోయాయని, వడగళ్ళు పడడంతో కర్బూజా, దోసకాయలు పగిలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే అంచనాలు తయారు చేసి ఉన్నత అధికారులకు పంపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చంగయ్య, హరి, జయరామయ్య, పెంచలయ్య, రమణ పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM